అక్బరుద్దీన్ కామెంట్స్ రచ్చ..! ఫిర్యాదుల వెల్లువ.. రెచ్చగొట్టలేదంటున్న ఎంఐఎం నేత
హైదరాబాద్ : అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో అక్బరుద్దీన్ స్పందించారు. తాను రెచ్చగొట్టేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా నడుచుకోలేదని స్పష్టంచేశారు.
ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను ఆరెస్సెస్ హతమారుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు గతంలో తాను చేసిన 15 నిమిసాల వ్యాఖ్యలపై ఆరెస్సెస్ ఉలిక్కిపడుతోందని గుర్తుచేశారు. పోలీసులు విధుల నుంచి తప్పుకుంటే 15 నిమిషాల్లో 100 కోట్ల భారతీయులను హతమారుస్తామని అక్బర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు ఖండించాయి. మరోవైపు తాజాగా అక్బర్ వైఖరిపై పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో సైదాబాద్ పోలీసుస్టేషన్లో హిందు సంఘటన్ సంస్థ ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని 153, 153ఏ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అక్బర్పై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. దీంతో అక్బరుద్దీన్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్లో తాను ఎవరినీ రెచ్చగొట్టేలా ప్రసంగించలేదని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని కించపరిచేటట్టు మాట్లాడలేదని వివరణలో పేర్కొన్నారు. తాను చట్టవిరుద్ధ ప్రకటన చేయలేదని తెలిపారు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాకాల కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు ఊహించుకొని తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కావాలనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరికీనీ కించపరిచేటట్టు మాట్లాడలేదని తేల్చిచెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications