విపక్షాల కథ క్లోజ్, 104సీట్లు మనవే: నేతపై కేసీఆర్ ఫైర్, ఎన్నారైని కొట్టిన ఫరూక్ది తప్పులేదు
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదే అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పటికీ మనం ఏమరుపాటున ఉండవద్దని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.ఎన్నికలు వస్త
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదే అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పటికీ మనం ఏమరుపాటున ఉండవద్దని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.
పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించే విషయం కెసిఆర్ చెప్పారు. సిట్టింగ్లకు టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్న కొందరు ఇంచార్జులు ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. టిక్కెట్ల కోసం టిఆర్ఎస్ భవన్కూ ఎవరూ రావొద్దన్నారు.

అన్ని సర్వేలు మనకే అనుకూలం
ఎన్నికలు వస్తే మన పార్టీకి 95 నుంచి 104 మధ్య సీట్ల వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు అంతా ప్రిపేరై అసెంబ్లీకి రావాలని సూచించారు. విపక్షాలు ఏం అడిగినా సమాధానం చెప్పేలా ఉండాలన్నారు.

విపక్షాల కథ ముగిసింది
రాష్ట్రంలో విపక్షాల కథ ముగిసిందని కేసీఆర్ చెప్పారు. వాళ్ల వద్ద ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వారి వద్ద ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ మనం అజాగ్రత్తగా ఉండవద్దని, అలర్ట్గా ఉండాలని కేసీఆర్ చెప్పారు.

ఫారూక్ హుస్సేన్ తప్పులేదు
ఇటీవల ఎన్నారై మహిళని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ కొట్టడంపై కేసీఆర్ స్పందించారు. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్సీపై ఆగ్రహం
ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిపై పదేపదే ఫిర్యాదు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహారాల్లో ఎమ్మెల్సీలకు ఏం పని అని చెప్పారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications