వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంచ ఐలయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిందూ సమాజాన్ని కించపరిచే పదజాలంతో పుస్తకాన్ని రాసిన కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐలయ్యపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి తిరుమలనగర్‌కు చెందిన దళిత యువకుడు కె నాగరాజు కొన్ని రోజుల క్రితం స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

 Malkajgiri Court orders to file a case on Ilaiah

వాదనలు విన్న కోర్టు కంచ ఐలయ్యపై సెక్షన్‌ 153ఏ, 153బీ, 295ఏ, ఐపీసీ 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి నవంబర్ 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మల్కాజిగిరి పోలీసులను ఆదేశించింది.

కాగా కంచ ఐలయ్య వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్న విషయం తెలిసిందే. కోమటోళ్లు సామాజిక స్మగర్లు అంటూ ఓ వివాదాస్పద పుస్తకం కూడా ఐలయ్యా రాసిన విషయం విధితమే.

English summary
Malkajgiri Court ordered to file a case on Kancha Ilaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X