Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్‌కు చుక్కెదురు, 'రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని ఎసిబి వేధిస్తోంది'

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు సోమవారం ఉదయం ఎసిబి న్యాయస్థానంలో హాజరయ్యారు. అనంతరం విచారణ 14వ తేదీకి వాయిదా పడింది.

కోర్టులో ఉదయ్ సిన్హా ఫిర్యాదు

ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయ్ సిన్హా న్యాయస్థానంలో ఎసిబి అధికారుల పైన ఫిర్యాదు చేశారు. కేసులో రాజకీయ నేతలకు ప్రమేయముందని చెప్పమని ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని, తన పైన ఒత్తిడి తెస్తున్నారని ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఉదయ్ సిన్హా జడ్జికి ఫిర్యాదు చేశారు.

Revanth Reddy

విచారణ పేరిట తనను వేధింపులకు గురి చేసిన ఏసీబీ అధికారులు, తాము చెప్పినట్లు వినాలని కూడా బెదిరిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఏసీబీ అధికారుల వేధింపుల నుంచి తనకు విముక్తి కల్పించాలని జడ్జిని కోరారు. మరోవైపు ఎసిబి మెమో దాఖలు చేసింది.

రేవంత్ రెడ్డికి లభించని ఊరట

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట లభించలేదు. తనకు బెయిల్ షరతులు సడలించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. షరతుల సడలింపుకు న్యాయస్థానం నిరాకరించింది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న
తాను హైదరాబాదులో ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ కోరారు. అయితే, చుక్కెదురయింది.

మరోవైపు, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరి బెయిల్ షరతులను కోర్టు కొంతమేర సడలించింది. ప్రతిరోజు కాకుండా, వారంలో సోమవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ఏసీబీ అధికారుల ఎదుట హాజరకావాలని ఏసీబీ కోర్టు తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+