పొత్తులపై కసరత్తు: తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు.
కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు. 20 సీట్లలో 35 శాతం ఓటింగ్ పదిలంగా ఉందని వివరించారు. తెలంగాణలో టీడీపీ బలం చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 36 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు తెదేపాకు తరగని ఆస్తని పేర్కొన్నారు. కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు.

పొత్తులపై చంద్రబాబు నిర్ణయిస్తారు
తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించినట్లు ఆ పార్టీ సినీయర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. టీడీపీపై చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చినట్లు రావుల పేర్కొన్నారు. లేక్ వ్యూ గెస్టు హౌజ్లో చంద్రబాబునాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు.
ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో పార్టీ తీసుకున్న కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అనుసరించే వ్యుహంపై చర్చ జరిగినట్లు చెప్పారు. పొత్తులపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని రావుల స్పష్టం చేశారు.
-
చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ సైతం, బిగ్ డెసిషన్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications