తెలంగాణలో సభకు జగన్ రాక: ఏపీ టిడిపి నేతతో కెసిఆర్ టార్గెట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీకి హాజరు కానున్నారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాదులో నిర్వహిస్తారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీకి హాజరు కానున్నారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాదులో నిర్వహిస్తారు.
ఈ ప్లీనరీకి తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హాజరవుతారని తెలంగాణ వైసిపి అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇదివరకే తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 8వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తామన్నారు.

కేసీఆర్ వైఫల్యాలు ఎండగడతాం
పార్టీని బలోపేతం చేసే దిశగా ప్లీనరీలో చర్చిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను కూడా ఎండగడతామన్నారు.

కేసీఆర్ వల్లే దీపక్ రెడ్డి కుంభకోణం
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు వల్లే టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్గా మారిందన్నారు. మియాపూర్ భూకుంభకోణంపై సమగ్ర దర్యాఫ్తు జరపాలన్నారు.

ఏపీకే పరిమితమైన జగన్ ఇప్పుడు..
కాగా, విభజన అనంతరం జగన్ ఏపీకే పరిమితమైన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం పైనే పోరాడుతున్నారు. ఏపీలో వైసిపి దాదాపు పూర్తిగా కనుమరుగయిందని చెప్పవచ్చు. టిడిపి అయినా ప్రాధాన్యత కోల్పోయినప్పటికీ కేడర్ ఉంది. అప్పుడప్పుడు చంద్రబాబు టిటిడిపిపై దృష్టి సారిస్తున్నారు.

తెలంగాణ ప్లీనరీలో..
కానీ జగన్ మాత్రం దాదాపు వదిలేశారు. మొత్తం తన దృష్టిని అంతటినీ ఏపీ పైనే పెట్టారు. అలాంటిది ఇప్పుడు వైసిపి ప్లీనరీలో పాల్గొన్నా పెద్దగా ఉపయోగపడేద లేదని అంటున్నారు. అది కేవలం మొక్కుబడి మత్రమే అవుతుందని అంటున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications