ఓకే వీధి.. జిల్లా వేరు.. నియోజకవర్గం, మండలాలు కూడా.. ఏపీలో ఎక్కడంటే...?
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అమల్లోకి వచ్చాయి. ఒక్కో లోక్ సభ నియోజకవర్గం పరిధిని జిల్లాగా చేశారు. అయితే జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల విస్తరణ, మండలాలు చేయడం.. అభివృద్ది కోసమే.. అలాగే ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు. కానీ ఏపీలో మాత్రం ఇందుకు విరుద్దంగా ఉంది. అంటే అన్ని జిల్లాలకు సంబంధించి మాత్రం కాదు.. ఒక జిల్లాలో ప్రజల పరిస్థితి విచిత్రంగా ఉంది. అదేంటో చూద్దాం పదండి.

ఒకే వీధి.. కానీ
ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాల్లో పలు వింత ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒకే వీధి ఇప్పుడు రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలకు సరిహద్దుగా మారింది. జిల్లాల పునర్విభజన వల్ల కొవ్వూరు నియోజక వర్గం తాళ్లపూడి మండలం తాడిపూడి, పోలవరం నియోజక వర్గం గూటాల పంచాయతీ పరిధిలో గల మహాలక్ష్మీదేవిపేట గ్రామం వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇదీ మాత్రం విచిత్రంగా మారింది. ఇదివరకు ఏ సమస్య లేకుండే.. జిల్లాల ఏర్పాటు ఆ ప్రాంతంలో ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది.

తూ.గో జిల్లా.. ఏలూరు జిల్లా
తాడిపూడిలోని ఓ వీధి కుడివైపు భాగం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లగా, ఎడమవైపున ఉన్న మహాలక్ష్మీదేవిపేట ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. ఫలితంగా ఒకే వీధి ప్రజలు రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు మండలాలు, వేర్వేరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదీ మాత్రం విచిత్రమే.. అవును ఒక వీధిలో రెండు భాగాలు మండలాలు, నియోజకవర్గాలు.. జిల్లాల పరిధిలోకి రావడం ఏంటీ.. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుంది. మరీ ఆ వీధి వారికి ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారో చూడాలీ మరీ.

సమస్య ఎవరికీ చెప్పాలి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ప్రతీ లోక్ సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలను కూడా నియమించారు. దీనిపై విపక్షాల విమర్శిస్తున్నారు. వారికి బలం చేకూరేలా ఈ ఘటన ఉంది. ఆ వీధి ప్రజలు కలిసి మెలసి ఉండేవారు. ఇప్పుడు సంఘాలు, కుల సంఘాల భవనాల సంగతి ఏంటీ అనే చర్చ జరిగింది. ఎందుకంటే మా నియోజకవర్గం కాదంటే మాదీ కాదని నేతలు అనే అవకాశం ఉంటుంది. సో.. ఆ వీధి ప్రజల పరిస్థితి మాత్రం వర్ణణాతీతంగా మారింది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications