రోశయ్యకు రెండున్నరేళ్ళేనా?

రోశయ్య కంటే జనంలో ముఖ్యంగా యువతరంలో జగన్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. అయితే రాజకీయ పరిపక్వత, మానసిక పరిపక్వత విషయంలో జగన్ పై హైకమాండ్ లో అనేక అనుమానాలున్నాయి.రెండున్నర ఏళ్ళ తర్వాతైనా జగన్ పరిణతి చెందిన నాయకుడుగా మారుతాడని కాంగ్రెస్ అధిష్టానం పాజిటివ్ గా ఆలోచిస్తున్నట్తు తెలుస్తోంది.
వరదల సమయంలో రోశయ్య ప్రభుత్వం చక్కగా పనిచేసిందన్న అభిప్రాయానికి అధిష్టానవర్గం వచ్చింది. అయితే పార్టీ ఫండ్ సమకూర్చే విషయంలో రోశయ్య ప్రోయాక్టివ్ గా వ్యవహరించగలరా అన్న సందేహాలు హైకమాండ్ కు ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే వైఎస్ ఆప్తమిత్రుడైన కెవిపి రామచంద్రరావుకు హైకమాండ్ ఒక మాట చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్ హయాంలో కలెక్షన్ల విషయంలో ఆయన ఎటువంటి చొరవ తీసుకున్నారో ఇప్పుడు కూడా ఆయన రోశయ్యకు ఆ విషయంలో అండాదండగా ఉండాలి. ఈమధ్య కాలంలో కెవిపి కాంగ్రెస్ హైకమాండ్ కు, రోశయ్యకు సన్నిహితంగా నడుచుకుంటున్నారు. రోశయ్య కూడా ఒక సందర్భంలో కెవిపి అంటే కాంగ్రెస్ హై కమాండ్ కు ప్రత్యేక అభిమానం ఉండని చెప్పడం గమనార్హం.
కెవిపికి వైఎస్ మీద ఉన్నంత ప్రేమ, వాత్సల్యం జగన్ మీద లేవని కెవిపిని నమ్ముకుని బతుకుతున్న సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. జగన్ సాక్షి మీడీయాను ప్రమోట్ చేయడం కెవిపికి వ్యక్తిగతంగా ఇష్టం లేదట. మరీ అంత నష్టాలు వస్తే నిధులు సమకూర్చడం కష్టమవుతుందని ఆయన వైఎస్ చెవిలో చెప్పగా అందుకు ఆ ప్రియ మిత్రుడు అంగీకరించినట్టు సమాచారం. ఆ మీడియా గ్రూపును దాసరి నారాయణరావుకు అప్పగించి చేతులు దులుపుకుందామనుకుంటున్న దశలో వైఎస్ హఠాన్మరణం పాలయ్యారు. ఇవీ సంగతులు.. మరిన్ని విశేషాలు త్వరలో...
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications