5కె రన్: ఉత్సాహంగా యువతీయువకులు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఆదివారం నిర్వహించిన 5కె రన్ విజయవంతమైంది. కనీవిని ఎరుగని రీతిలో యువత వేలాది సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. చార్మినార్ నుండి ప్రారంభమైన పరుగు షాలిబండ, లాల్దర్వాజ క్రాస్ రోడ్డు మీదుగా అలియాబాద్, ఇంజన్బౌలి, ఫలక్నూమ, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, బార్కస్ వరకు కొనసాగింది.
పోలీసులు నగర పౌరుల మధ్య స్నేహభావం పెంపోందేందుకు ఐదు కిలోమీటర్ల శాంతి పరుగును నిర్వహించారు. రన్లో దాదపు పదివేల మందికిపైగా పాల్గొన్నారు. రన్ను చార్మినార్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ జెండా ఊపి ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఎంఎ ఆరీఫ్, పుల్లెల గోపీచంద్, నైనా జైస్వాల్, మోతె శ్యాం, ఎవరెస్ట్ అధిరోహకులు పూర్ణ, ఆనంద్లను సన్మానించారు. పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.
బ్యాడ్మింటన్లో ద్రోణచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరీఫ్, భారత బాడీబిల్డింగ్ కోచ్ మోతేష్యామ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైస్వాల్, హైదరబాద్ జిల్లా టెబుల్ టెన్నిస్ సంఘం కార్యధర్శి అశ్వినికుమార్ పాల్గొన్నారు. బార్కాస్ మైదానంలో జరిగిన రన్ ముగింపు కార్యక్రమంలో దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణ, అదనపు డిసిపి బాబూరావుతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ఎసిపిలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, శాంతి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

5కె రన్
నగరంలోని పాతబస్తీలో ఆదివారం నిర్వహించిన 5కె రన్ విజయవంతమైంది.

5కె రన్
కనీవిని ఎరుగని రీతిలో యువత వేలాది సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

5కె రన్
చార్మినార్ నుండి ప్రారంభమైన పరుగు షాలిబండ, లాల్దర్వాజ క్రాస్ రోడ్డు మీదుగా అలియాబాద్, ఇంజన్బౌలి, ఫలక్నూమ, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, బార్కస్ వరకు కొనసాగింది.

5కె రన్
పోలీసులు నగర పౌరుల మధ్య స్నేహభావం పెంపోందేందుకు ఐదు కిలోమీటర్ల శాంతి పరుగును నిర్వహించారు.

5కె రన్
5కె రన్లో క్రీడాకారులు, ప్రముఖులతోపాటు దాదపు పదివేల మందికిపైగా పాల్గొన్నారు.

5కె రన్
రన్ను చార్మినార్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ జెండా ఊపి ప్రారంభిచారు.

5కె రన్
ఈ సందర్భంగా ఎంఎ ఆరీఫ్, పుల్లెల గోపీచంద్, నైనా జైస్వాల్, మోతె శ్యాం, పూర్ణ, ఆనంద్లను సన్మానించారు. పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.

5కె రన్
పరుగును ప్రారంభించే ముందు ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ, శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డి, బాలాల, నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తదితరులతో కలిసి శాంతి కపోతాలను ఎగురవేశారు.

5కె రన్లో డిప్యూటీ సిఎం
పోలీసుల పనితీరులో నెలకొన్న అపోహలను తొలగించడం, వారిలో స్నేహాన్ని పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో నేరాలను తగ్గించాలన్నదే పరుగు ప్రధాన ఉద్దేశ్యమని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు.

5కె రన్
పాతబస్తీలో నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి నిర్వహించిన ఈ 5కె రన్లో అనేక మంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులతో పాటు పోలీసు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

5కె రన్
బ్యాడ్మింటన్లో ద్రోణచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరీఫ్, భారత బాడీబిల్డింగ్ కోచ్ మోతేష్యామ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైస్వాల్, హైదరబాద్ జిల్లా టెబుల్ టెన్నిస్ సంఘం కార్యధర్శి అశ్వినికుమార్ పాల్గొన్నారు.

5కె రన్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరమని, నేటి యువతరం వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ పొంది గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని కోరారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications