శంఖా ఘోష్కు జ్ఞానపీఠ్ పురస్కారం: ఆధునిక బెంగాలీ సాహిత్యంలో తనదైన ముద్ర
సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే 'జ్ఞానపీఠ్' ను ఈ ఏడాదికి గాను షంఖా ఘోష్ ను ఎంపిక చేసినట్టు జ్ఞానపీఠ్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ: సుప్రసిద్ద బెంగాలీ కవి శంఖా ఘోష్ కు జ్ఞానపీఠ్ పురస్కారం దక్కింది. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే 'జ్ఞానపీఠ్' ను ఈ ఏడాదికి గాను షంఖా ఘోష్ ను ఎంపిక చేసినట్టు జ్ఞానపీఠ్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా, శంఖాఘోష్ 1932లో చాంద్ పూర్ లో జన్మించారు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ లో ఉంది. బెంగాలీ సాహిత్యంలో ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి శంఖా ఘోష్ పట్టా పుచ్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్ కతా నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.
అనంతరం బంగబాసి కాలేజ్, సిటీ కాలేజ్ ఆఫ్ కోల్ కతా, ఢిల్లీ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ షిమ్లా.. ఇలా చాలా విద్యాలయాల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1992లో జాదవ్ పూర్ యూనివర్సిటీ నుంచి రిటైర్ట్ అయ్యారు. 1960లో లోవా రైటర్స్ వర్క్ షాపు తరుపున కూడా ఆయన పనిచేశారు. ఆధునిక బెంగాలీ సాహిత్యంలో రవీంద్రనాథ్ తర్వాత శంఖా ఘోష్ అంతటి బలమైన ముద్ర వేయగలిగారు.
రచనలు
:
ఆదిమ్
లతా-గుల్మోమాయ్
ముర్ఖా
బరో,
సామాజిక్
నాయ్(
ఏ
ఫూల్,
నాట్
సోషల్)
కబీర్
అభిప్రాయ్(ది
పోయెట్
ఇంటెన్షన్)
ముఖ్
దేఖే
జే
బిగ్యాపనే
బాబుర్స్
ప్రేయర్