కడప ఉప పోరులో స్త్రీ శక్తి

దివంగత పరిటాల రవీంద్ర సతీమణి, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతది అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు, పరిటాల అభిమానులు భారీగా ఉన్న గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తుంది. అభిమానాన్ని ఓటుగా మలుచుకోగలుగుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పరిటాల సునీత ప్రచారానికి మిగతా వారి కంటే అనూహ్య స్పందన వస్తుంది. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైసూరారెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఆమె పరిటాల అభిమానులను, ప్రచారాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రజలను కోరుతోంది. సునీత ప్రచారం చేస్తున్న గ్రామాలలో ప్రజా స్పందన చూసిన టిడిపి కార్యకర్తలు మంచి ఉత్సాహంతో కనిపిస్తున్నారంట. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కడప జిల్లా పార్టీ అధ్యక్షురాలు కుసుమకుమారితో పాటు పలువురు మహిళా నేతలు ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. వీరు జగన్ అవినీతిపై, కాంగ్రెసు అభ్యర్థులపైన కాకుండా టిడిపి గెలిస్తే ఏం చేస్తుంది, ఎందుకు ఓటెయ్యాలో చెప్పడంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు సాధ్యమైనంతగా దూరంగా ఉంటున్నారు.
ఇక వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ తరఫున రోజా, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతీ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అయితే వీరు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పై తీవ్రంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం విశేషం. అయితే రోజా ప్రచారానికి ప్రజలు భారీగా వస్తున్నప్పటికీ లక్ష్మీపార్వతి ప్రచారానికి మాత్రం అంతగా ఆధరణ కనిపించడం లేదని తెలుస్తోంది. ఇక జగన్ చెల్లెలు షర్మిళ కూడా తల్లి, అన్నయ్య విజయానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. తన అన్నయ్యను కుట్రతో కాంగ్రెసు నుండి బయటకు పంపించారని వోటర్లను నమ్మించడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ప్రచార తీరు పూర్తిగా సానుభూతి కలిగించేలా ఉంటోంది. ఇక దివంగత ముఖ్యమంత్రి వైయస్ సతీమణి ఎలాగూ అభ్యర్థి కాబట్టి ఆమె పులివెందులలో గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తోంది. అయితే వైయస్ ఉన్నప్పుడు ఇంటిని విడిచి బయటకు రాని విజయమ్మ, షర్మిళాలను మాత్రం జగన్ తన స్వార్థం కోసం మండుటెండలో వారిని కష్ట పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక కాంగ్రెసు తరఫున ప్రముఖంగా ఎవరూ లేక పోయినప్పటికీ కేంద్ర మంత్రి పురందేశ్వరి బుధవారం పులివెందులలో వైయస్ వివేకా అభ్యర్థన మేరకు ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె కూడా జగన్పై విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరో వైపు వివేకానంద భార్య, కూతురు కూడా పులివెందుల నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ వివేకానందకు వోటేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే వారు కాంగ్రెసు కార్యకర్తలుగా కాకుండా వివేకా కుటుంబ సభ్యులుగా ప్రచారం చేస్తుండటం విశేషం.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications