సమ్మె నోటీసు: కెసిఆర్ ఉప ఎన్నికల వ్యూహం?
ఇదే సమయంలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం ఖాయం. కానీ భారీ మెజార్టీ సాధించడం ఇప్పుడు టిఆర్ఎస్కు ఖచ్చితంగా అవసరం. ఇటీవల సకల జనుల సమ్మె సమయంలో జరిగిన బాన్సువాడ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థికి కనీసం ధరావత్తు కూడా రాదని అందరూ భావించారు. కానీ అతను భారీ ఓట్లు సాధించాడు. ఇది టిఆర్ఎస్కు గట్టి దెబ్బ. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనే బాన్సువాడ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుకున్న మెజార్టీని సాధించక పోవడం చూస్తే పోలవరం టెండర్లతో చిక్కుల్లో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో మరింత మెజార్టీ తగ్గవచ్చని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఉప ఎన్నికల్లో విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఉద్యోగుల సమ్మె నోటీసులు, జెఏసిలో అసంతృప్తితో ఉన్న పార్టీలను కలుపు వెళ్లడం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.