'సింహా' అదుర్స్: బాలకృష్ణ టూర్ హిట్టా? ప్లాపా?
తనను ఇప్పటి వరకు ఒకవైపే చూశారని.. రెండో వైపు చూపిస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని, ఉద్యోగాలు ఇచ్చారని, దీంతో బతుకు బతికించు అనే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. అదే కాంగ్రెసు హయాంలో దోచుకో దాచుకో,, ఆంధ్రప్రదేశ్ అంధ ప్రదేశ్గా, అధిక ధరల ప్రదేశ్గా మారిందని కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు గుప్పించారు. అధికార పార్టీని ఆయన ఏకీపారేశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మంచి రోజులు వస్తాయన్నారు. రాష్ట్రం బాగుపడుతుందన్నారు. బాలయ్య పర్యటన విశాఖ టిడిపిలో కొత్త ఉత్సాహం నింపిందట. మరో పది రోజుల్లో బాబు పాదయాత్ర విశాఖ జిల్లాకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో బాలయ్య పర్యటన బాబు పర్యటనకు పనికి వస్తుందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డైలాగులతో అదరగొట్టిన బాలయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే టిడిపికి బాగా ఉపకరిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బాలకృష్ణ విశాఖ పర్యటన సూపర్ హిట్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య పర్యటనలో అభిమానుల మధ్య తోపులాట సాగింది. దీనిపై బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత వారితో కలిసి ఫోటో దిగారు. మరోవైపు బాలకృష్ణ విశాఖ పర్యటన ప్లాప్ అయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి రాసింది.
బాలయ్య పర్యటన వెలవెల బోయిందని, బాలయ్య పర్యటనను విజయవంతం చేయడంలో తమ్ముళ్లు విఫలమయ్యారని, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పార్టీలో లేని లోటు స్పష్టంగా కనిపించిందని, బాలయ్య పర్యటించిన గ్రామాల్లో మూడు వందలకు మంచి అభిమానులు, కార్యకర్తలు రాలేదని పేర్కొంది. అలాగే బాలయ్య ప్రసంగాలు కూడా ఆకట్టుకోలేక పోయాయని పేర్కొంది.