వైయస్ కోడ్ ఉల్లంఘన: తెరాస
నిజామాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. పాఠశాలలో వైయస్ బహరింగసభ నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెరాస ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ జిల్లాలో ప్రచారయాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తానే ఎన్నికల కోడ్ను యధేచ్ఛగా ఉల్లంఘించారు. ఆదిలాబాద్నుంచి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి హైస్కూలు ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్నారు.
రాజకీయపార్టీలు పాఠశాల ఆవరణలో సభలు నిర్వహించుకోవచ్చునని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అయితే అందుకు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రాజకీయ పార్టీలు పాఠశాల సమయంలో నిర్వహించటం సాధారణమే. అయితే పాఠశాల నడుస్తున్న సమయంలో, అదీ పరీక్షల సమయంలో ముఖ్యమంత్రి సభ జరగడం విమర్శలకు దారి తీసింది. వైయస్ సభ జరుగుతున్న సమయంలో పాఠశాలలో విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ఆ సమయంలో లౌడ్స్పీకర్లు, హోరెత్తే ప్రసంగాలతో విద్యార్థులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ ఘటనపై ఎన్నికల పర్యవేక్షణ అధికారి మీరా శ్రీ వాస్తవ్ ఆరా తీస్తున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications