బాక్సైట్ తవ్వకాలపై అసెంబ్లీలో రభస

విశాఖ గనుల లీజును రద్దు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. మంత్రి సమాధానాన్ని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రం నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చే సమయంలో మంత్రి ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఆమోదించిన తర్వాత బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications