ఎఫ్ ఐఎ భవనంపై దాడి: పలువురు మృతి

FIA Building in Lahore
లాహోర్: పాకిస్తాన్ లోని లాహోర్ లో సోమవారం భారీ ఉగ్రవాద దాడి జరిగింది. లాహోర్ లోని ఫెడరల్ ఇన్వెస్టేగషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) భవనం వద్ద ఉగ్రవాదులు కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మరణించినట్లు ధ్రువీకరించారు. మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పలువురు గాయపడ్డారు.

ఈ సంఘటనలో భారీ విధ్వంసం జరిగింది. ఇటీవలి కాలంలో అదే అతి పెద్ద దాడి అని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు వచ్చాయి. ఎఫ్ఐఎ భవనానికి సమీపంలోని మోడల్ టవున్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని, సంఘటన స్వభావాన్ని, మరణాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని పోలీసు అధికారి మొహమ్మద్ రియాజ్ చెప్పారు.

పేలుడు పదార్ధాలతో కూడిన కారను నడుపుకుంటూ వచ్చి ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఎ భవనం పాక్షికంగా దెబ్బ తిన్నది. సంఘటనా స్థలంలో ఇటుకల కుప్పలు, మెటల్ పడి ఉన్నాయి. సమీపంలోని భవనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఈ దాడికి పాల్పడిందెవరనేది తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+