హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుఫాను: పలు రైళ్లు రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

Trains affected by Cyclone Laila
హైదరాబాద్‌: రాష్ట్రంలో తుఫాను పరిస్థితి ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. పలు రైళ్లు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కృష్ణా, తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌లు, గుంటూరు ప్యాసింజర్‌ రైళ్లు రద్దయ్యాయి. రాజమండ్రినుంచి విశాఖ వెళ్లే 435వ నంబరు ప్యాసింజర్‌ రైలు రద్దయింది. హౌరా-హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 5 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో తుని-హంసవరం రైల్వేస్టేషన్‌ మధ్య గూడ్సురైలు నిలిచిపోయి ఇతర రైళ్లకు అంతరాయం కలిగింది. ముందు జాగ్రత్త చర్యగా దక్షిణ మధ్య రైల్వే రైళ్ల వేగాన్ని కూడా తగ్గించింది.

కోస్తా జిల్లాలకు వెళ్లే 31 ప్యాసింజర్ రైళ్లను గురువారం, శుక్రవారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తుఫాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున రైళ్ల వేగాన్ని 60 కిలోమీటర్లకు తగ్గించాల్సిందిగా ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం ఉదయం 32 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రైల్వే ట్రాక్ పై నీళ్లు నిలిచాయి. పలు రైళ్లను స్టేషనులోనే నిలిపేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X