మంత్రి వట్టి షోకుల వాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం

సూక్ష్మరుణ సంస్థలు అధిక వడ్డీలకు ప్రజలకు డబ్బులు ఇచ్చి వారి నడ్డి విరుస్తున్నాయన్నారు. ఇప్పటికే సూక్ష్మ బాధ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వం ఇలాగే ఉంటే సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు పెరుగుతాయని ఇప్పటికైనా సరియైన విధంగా స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సూక్ష్మరుణ వేధింపులకు ఏఐసిసి అధికార ప్రతినిధి రాహుల్ గాంధీయే కారణమన్న తన తెలుగు దేశం పార్టీ వాఖ్యలకు కట్టుబడి ఉందన్నారు. ఆకుల విక్రమ్ సూక్ష్మరుణ సంస్థ అయిన ఎస్ కె ఎస్ వేధింపులకు రాహుల్ గాంధీ కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీకి సైతం ఇందులో పాపం ఉందన్నారు. సోనియాగాంధీ స్వయంగా వచ్చి సూక్ష్మ బాధితుల బాధలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూక్ష్మరుణ సంస్థల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ప్రజలు డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రసాల సాధనాలపై అసహనం వ్యక్తం చేయటం మానేసి సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. పొరపాటునే గ్రహపాటునో ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పి ముఖ్యమంత్రి తన అసమర్థతను చాటుకున్నాడన్నారు. సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు అరికట్టడానికి అంటూ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం కోరలు లేనిదిగా ఉందన్నారు.
సూక్ష్మరుణ వేధింపులకు నిరసనగా వచ్చే నెల 2 నుంచి 8వ తేది వరకు నియోజకవర్గ స్థాయిల్లో, 9 నుంచి 15 వరకు జిల్లా స్థాయిల్లో, 16వ తేదిన రాష్ట్రస్థాయిలో తెలుగు దేశం పార్టీ ఆందోళన నిర్వహిస్తుందని చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications