చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజాపై వేటుకు డిఎంకె మొగ్గు!: రాజాకు మద్దతుగా లాయర్ల ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

A Raja
చెన్నై: 2జి స్పెక్ట్రంలో లక్ష డెబ్బయి వేల కోట్ల అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయిన మాజీ టెలికాం మంత్రి రాజాపై వేటు వేసేందుకు డిఎంకే నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ముంగిట్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా అవినీతి మచ్చపడ్డ రాజాను వదిలించుకునేందుకే డిఎంకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరుణానిధి గురువారం ఉదయం కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం చాలా హాట్ హాట్‌గా సాగినట్టు సమాచారం. కార్యవర్గ సమావేశంలో ఓ వర్గం రాజాకు మద్దతు పలుకుతున్నప్పటికీ ఎక్కువ మంది ఆయనను వదిలించుకునేందుకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రతిపక్షాలు రాజా అవినీతిని ఉపయోగించుకుని లాభపడతారని డిఎంకే యోచిస్తుంది. జయలలిత రాజా స్కాంను తమపై ఎక్కుపెట్టవద్దనుకుంటే ఆయనపై వేటే సరియైన చర్యగా భావిస్తున్నట్టుగా తెలిస్తోంది. అయితే రాజాను ఓసారి బెదిరించి వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే రాజా స్కాం ప్రభావం సిటీలో, చదువుకున్న వారిలోనే తప్ప గ్రామీణానికి అంతగా తెలియదనే వారు ఉన్నట్టుగా తెలిస్తోంది. ఆ కారణంగా రాజాకు ఓ అవకాశం ఇచ్చి చూడవచ్చు అనే వారూ ఉన్నారంటున్నారు.

ఈ నేపథ్యంలో సాయంత్రం చెన్నైలో డిఎంకే భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో కీలక తీర్మానాలు చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తమిళనాడులో లాయర్లు రాజాకు మద్దతుగా నిలిచారు. గురువారం మధ్యాహ్నం రాజా అరెస్టుకు నిరసనగా హైకోర్టులో ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X