Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

14న చిరంజీవి బహిరంగ సభ, 10న అభిమానులతో సమావేశం

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్న చిరంజీవి ఈ నెల 14వ తేదీన హైదరాబాదులోని భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభలో అధికారికంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే అవకాశం చేసే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చిరంజీవి మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాదు రానున్నారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు, కార్యకర్తలు స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పెద్ద యెత్తున పాల్గొనే అవకాశాలున్నాయి.

కాగా, రేపు మంగళవారం రాత్రి ఏడు గంటలకు చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో సమావేశమవుతారు. ఢిల్లీ పరిణామాలపై ఆయన ఈ సమావేశంలో వివరిస్తారు. ఈ నెల 10వ తేదీన ఆయన హైదరాబాదులోని శిల్ప కళావేదికలో తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ సమావేశం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి తలెత్తిన పరిణామాలపై ఆయన కార్యకర్తలకు, అభిమానులకు వివరణ ఇస్తారు. దీనికి ముందు ఈ నెల 9న తేదీన ప్రజారాజ్యం పార్టీ కార్యవర్గం సమావేశమై కాంగ్రెసులో విలీనం చేస్తూ ఓ తీర్మానం చేస్తుందని అంటున్నారు.

కాగా, ఆదివారం సాయంత్రం విలీనం విషయాన్ని ప్రకటించిన చిరంజీవి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానానికి చెందిన వివిధ నాయకులతో ఆయన సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తనకు పూర్తి సహకారం అందించాలని ఆయన జైపాల్ రెడ్డిని కోరే అవకాశం ఉంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆయన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+