14న చిరంజీవి బహిరంగ సభ, 10న అభిమానులతో సమావేశం

కాగా, రేపు మంగళవారం రాత్రి ఏడు గంటలకు చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో సమావేశమవుతారు. ఢిల్లీ పరిణామాలపై ఆయన ఈ సమావేశంలో వివరిస్తారు. ఈ నెల 10వ తేదీన ఆయన హైదరాబాదులోని శిల్ప కళావేదికలో తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ సమావేశం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి తలెత్తిన పరిణామాలపై ఆయన కార్యకర్తలకు, అభిమానులకు వివరణ ఇస్తారు. దీనికి ముందు ఈ నెల 9న తేదీన ప్రజారాజ్యం పార్టీ కార్యవర్గం సమావేశమై కాంగ్రెసులో విలీనం చేస్తూ ఓ తీర్మానం చేస్తుందని అంటున్నారు.
కాగా, ఆదివారం సాయంత్రం విలీనం విషయాన్ని ప్రకటించిన చిరంజీవి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానానికి చెందిన వివిధ నాయకులతో ఆయన సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తనకు పూర్తి సహకారం అందించాలని ఆయన జైపాల్ రెడ్డిని కోరే అవకాశం ఉంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆయన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications