వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఝాన్సీ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు: కోదండరాం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భాజపా మహిళా నేత వనం ఝాన్సీ మృతి పట్ల ఆ పార్టీ నేతలు వెంకయ్యనాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగరరావు సహా పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఝాన్సీ మృతి పార్టీకి తీరని లోటని కిషన్‌రెడ్డి అన్నారు. మలక్‌పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించిన ఆమె భౌతికకాయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఝాన్సీ చురుకైన పాత్ర పోషించారని అన్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని అన్నారు.

ఝాన్సీ మృతిపై పార్టీలకతీతంగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తమ సంతాపాన్ని తెలియజేశారు. ఝాన్సీ మృతితో మంచి నాయకురాలిని కోల్పోయామని ప్రముఖ సినీ నటి రోజా, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. ఝాన్సీ మృతి తెలంగాణ ఉద్యమానికి తీవ్ర నష్టమని రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
BJP Senior leader Venkaiahnaidu, state president Kishan Reddy said condolence to Vanam Jhansi family today. Telangana JAC chairman Kodandaram said Jhansi death Very loss to Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X