హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసంపై దద్ధరిల్లిన అసెంబ్లీ, వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: మిలియన్ మార్చ్ సందర్భంగా హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌ విగ్రహాల ధ్వంసంపై శుక్రవారం శాసనసభ దద్ధరిల్లింది. విగ్రహాల ధ్వంసంపై తక్షణ చర్చకు అనుమతించాలని సీమాంధ్ర శాసనసభ్యులు పట్టుబట్టారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే శాసనసభ వాయిదా పడింది. విగ్రహాల విధ్వంసపై చర్చ చేపట్టాలని సీమాంధ్ర ఎమ్యెల్యేలు స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్యెల్యేలు నిరసన చేపట్టారు. సీమాంధ్ర ఎమ్యెల్యేలు కార్యక్రమాలను అడ్డుకోవడంతో గత్యంతరం లేక సభను అరగంటపాటు వాయిదా వేస్తూ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాంక్‌బండ్‌పై విధ్వంసంపై ప్రారంభంలోనే అరగంట వాయిదా పడ్డ శాసనసభను తిరిగి ఆరంభమైన మరికొద్ది సేపటికే మరో పదిహేను నిమిషాలపాటు వాయిదా వేస్తూ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభను సజావుగా నిర్వహించేందుకు ఫ్లోర్ లీడర్‌లు తన ఛాంబర్‌కు రావాలని చెప్పి సభను వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత విగ్రహాల విధ్వంసంపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన చేస్తారని మంత్రి శ్రీధర్‌బాబు సభలో చెప్పినప్పటికీ తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో విధి లేక నాదెండ్ల మనోహర్ మరోసారి వాయిదా వేశారు.

English summary
Assembly adjourned twice, as TDP Seemandhra MLAs stalled the proceedings on Tank bund statues attack. They demanded immediate debate on that issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X