వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాస్తులపై జగన్‌ను ప్రజలే నిలదీస్తారు: వి. హనుమంతరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ: అక్రమాస్తులపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను సమయం వచ్చినప్పుడు ప్రజలే నిలదీస్తారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. వైయస్ జగన్‌కు అన్ని అస్తులు ఎలా వచ్చాయే ప్రజలు ఎన్నికల సందర్భంలో నిలదీస్తారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు ఆయన శనివారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం లేదని ఆయన అన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో సన్న, చిన్నకారు రైతుల భూములను పెద్ద యెత్తున ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో సేకరించారని, వాటిని తిరిగి తీసుకుని పేదలకు ఇవ్వడం మంచిదని ఆయన అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) కేటాయించిన భూములపై సమీక్ష చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. సెజ్‌ల భూకేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడివారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినవారికి శిక్ష పడితేనే క్రమశిక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Congress leader V Hanumanth Rao once again lashed out YS Jagan. He said that public will question YS Jagan about his properties. He said that there is no loss to Congress with Jagan odarpu yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X