బ్రాహ్మణి స్టీల్స్ వాటాలు విక్రయించడం లేదు: జిఎండి రామచంద్రా రెడ్డి
బ్రాహ్మణి స్టీల్స్కు 30 రోజుల గడువు ఇస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. సంస్థ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోయినా, అసలే సమాధానం ఇవ్వకపోయినా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అలాగే, బ్రాహ్మణి స్టీల్స్ వాటాలను ఉత్తమ్ గాల్వాకు విక్రయించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. బ్రాహ్మణి స్టీల్స్ వాటాలు విక్రయించే ప్రసక్తి లేదని సంస్థ అధిపతి, గాలి జనార్దన్ రెడ్డి కూడా సోమవారం స్పష్టం చేశారు.
Comments
ramachandra reddy brahmani steels gali janardhan reddy kiran kumar reddy hyderabad బ్రాహ్మణి స్టీల్స్ గాలి జనార్దన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్
English summary
GMD Ramachandra Reddy condemned the reports about tha sale of Brahmani steels. He said that Brahmani Steels shares will not be sold.
Story first published: Tuesday, April 12, 2011, 11:50 [IST]