బుజ్జగింపులకు లొంగేది లేదు, హామీ కావాల్సిందే: వివేక్
తెలంగాణపై సంప్రదింపులు జరగాలని, ఏకాభిప్రాయం కావాలని తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఒత్తిడిలో అన్నారని ఆయన అన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేశాయని, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చాయని, ఏకాభిప్రాయం సాధించాలనే ఆజాద్ మాటలు సరి కాదని ఆయన అన్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నామని, ఎల్లుండి ఉదయం 11 గంటలకు పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో, శాసనసభ్యులు హైదరాబాదులో రాజీనామాలు చేస్తారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు.
కొన్ని న్యూస్ చానెల్స్ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. సమావేశానికి రానివారి గురించి ఎత్తుతూ మీడియా తమపై దుష్ప్రచారం చేస్తోందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. సమావేశానికి వచ్చిన ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగతా వారంతా రాజీనామాలకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. రాజీనామాలకు సిద్ధపడినవారిని ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.
తెలంగాణ ఇవ్వండి, లేదంటే తమ రాజీనామాలను ఆమోదించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు వివేక్ చెప్పారు. పార్టీ అధిష్టానం కూడా తమ రాజీనామాల నిర్ణయంపై ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తమ రాజీనామాలు అక్కడ ఉంటాయని ఆయన చెప్పారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు. రాజీనామాలు చేయాలనే తమ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చెప్పారు.