వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసి చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెస్సార్

By Pratap
|
Google Oneindia TeluguNews

M Satyanarayana Rao
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) చైర్మన్ పదవికి ఎం. సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపించారు. కాగా, వరంగల్లు జిల్లా పరిషత్ చైర్మన్ ధన్వంతరి కూడా తన రాజీనామా సమర్పించారు. ధన్వంతరి తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

ఇదిలా వుంటే, మొత్తం 15 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇందులో 12 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారు, ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఉన్నారు. రాజీనామాలు చేయని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లకు ఉస్మానియా విశ్వవిద్యాలంయ జెఎసి హెచ్చరికలు జారీ చేసింది. రాజీనామాలు చేయనివారి ఇళ్లపై దాడులు చేస్తామని సోమవారం హెచ్చరించింది. రెండు రోజుల పాటు తెలంగాణ జెఎసి తలపెట్టిన రెండు రోజుల బంద్‌కు సిపిఐ మద్దతు ప్రకటించింది. కేబుల్ ఆపరేటర్ల సంఘం కూడా మద్దతు తెలిపింది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత రాజీనామా చేయాల్సిన అవసరం లేదని హైదరాబాదుకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఎం. శశిధర్ రెడ్డి అన్నారు.

English summary
APS RTC chairman M Satyanarayana Rao resigned for his post today in support of Telangana cause.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X