హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారు చేస్తే మేమూ రాజీనామా చేస్తాం: జెసి దివాకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడతారని రాజీనామాలతో ఫలితం ఉండదని అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. తెలంగాణపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందన్నారు. తెలంగాణ నేతలు చేసిన రాజీనామాలకు విలువ లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం, సమైక్యాంధ్రపై ఎవరి వాదనలు వారికి ఉంటాయని వారి వారి అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్రమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండేవారు పార్టీలో ఉంటారు. వెళ్లేవారు వెళతారని అన్నారు. తెలంగాణ అంశం పతాకస్థాయికి చేరిందన్నారు. ఈ అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒక నిర్ణయం ద్వారా అన్ని ప్రాంతాల వారిని సంతృప్తిపర్చడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ రవికుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చే సమస్యే లేదన్నారు.

English summary
Anantapur district congress mla JC Diwakar Reddy said today that seemandhra leaders may resign against telangana leaders resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X