తెలంగాణ నేతలకు మంత్రి ప్రణబ్ ముఖర్జీ చీవాట్లు

Pranab Mukharjee
న్యూఢిల్లీ‌‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసి తన వద్దకు చర్చలకు వచ్చిన కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులను, మంత్రి జానారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులకు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమస్య ఒక రోజులో తేలిది కాదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఇంటి దారి పట్టారు. మంగళవారం అర్థరాత్రి దాటే వరకు తెలంగాణ నేతలు ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశం కావాల్సి ఉంది. అయితే, ఆ సమావేశం రద్దయింది. విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ తేల్చేయడంతో అహ్మద్ పటేల్‌తో చర్చలు జరపాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందని అంటున్నారు.

రాజీనామాల ఉపసంహరణకు, ఇతర ప్రతిపాదనలకు తెలంగాణ నేతలను ఒప్పించడానికి మధ్యవర్తిగా వ్యవహరించాలని అధిష్టానం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కోరినట్లు చెబుతున్నారు. అందుకు ఆయన నిరాకరించారని తెలుస్తోంది. అయితే, తెలంగాణ అంశాన్ని తమ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందని రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవ రావు ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణపై పది, పదిహేను రోజుల్లో అధిష్టానం నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు. చర్చల కోసం హస్తినకు పిలిచి వారిని ఉట్టి చేతులతో హైకమాండ్ వెనక్కి పంపింది. సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణలో ఏ ఒక్కరు కూడా గెలవబోరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేస్తే తాము రాజీనామాలు ఉపసంహరించుకుంటామని ఆయన అన్నారు.

తాము చిన్న రాష్ట్రాలకు అనుకూలమని పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ కూడా అన్నారని ఆయన చెప్పారు. వంద మంది రాజీనామా చేసిన తర్వాత శాసనసభలో ఒక ప్రాంతానికి మొత్తం ప్రాతినిధ్యమే లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+