వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనల్ని మనం చాలా హింసించుకున్నాం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనల్ని మనం ఇప్పటికే చాలా హింసించుకున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు పంపిన సందేశంలో అన్నారు. దీక్షలు విరమించాలని కోరుతూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ సందేశం పంపించారు. రెండు రోజులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దీక్షలు చేస్తున్నారు. రెండు విశ్వవిద్యాలయ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఆయన ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.

తన అభ్యర్థనను మన్నించి దీక్షలు విరమించాలని ఆయన విద్యార్థులను కోరారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల భవిష్యత్తు కోసమే జరుగుతోందని ఆయన అన్నారు. దీక్షల ద్వారా ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే మనల్ని మనం చాలా హింసించుకున్నామని, పదునైన వ్యూహాలతో రాజీలేని పోరాటం చేద్దామని ఆయన విద్యార్థులతో అన్నారు.

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీక్షలు పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. బయటివారికి లోనికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పోలీసుల తీరును గద్దర్ తప్పు పట్టారు. తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానని ఆయన చెప్పారు.

English summary
TRS president K Chandrasekhar Rao appealed to the OU and KU students to withdraw fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X