వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి కేసు: శ్రీలక్ష్మి, రాజగోపాల్ అరెస్టుకు రంగం సిద్ధం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులను అరెస్టు చేయడానికి దాదాపు సిబిఐ సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన మైనింగ్ కేసులో మాజీ గనుల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ ఎండి రాజగోపాల్‌లపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని ఎ-3గా, రాజగోపాల్‌ను ఎ-4గా చేర్చారు. వీరిని సహ నిందితులుగా చేర్చారు. వీరి అక్రమాలపై సిబిఐ అధికారులు బలమైన ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి, మైనింగ్ ఎండి శ్రీనివాస్‌ల పేర్లు ఎ-1, ఎ-2లుగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వారు అక్రమ మైనింగ్ జరుగుతుంటే సహాయ పడ్డారా లేక అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా తదితర అంశాలను పరిశీలించి వారిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోని రాజగోపాల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేసి కీలక పత్రాలు సేకరించిన విషయం తెలిసిందే. శనివారం శ్రీలక్ష్మి ఇంట్లోనూ సుమారు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు సమాచారం.

English summary
It seems IAS officers Rajagopal and Srilaxmi may arrested any time. CBI put case against them today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X