వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరిన నాగం కోరిక, ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కోరిక తీరింది. ఆయన డిమాండ్‌ను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంగీకరించారు. నాగం జనార్దన్ రెడ్డి రాజీనామాను స్పీకర్ శనివారం సాయంత్రం ఆమోదించారు. ఆయన రాజీనామాతో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించారు. వీరిద్దరు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనవారే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరితో విభేదిస్తూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా చేశారు.

తన రాజీనామాను ఆమోదింపజేయాలని కోరుతూ నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్ కోర్టులో విచారణకు వచ్చే లోపలే స్పీకర్ రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీతో విభేదిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. దీంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌ను కోరుతూ ఫిర్యాదు చేసింది. అనర్హత పిటిషన్ పెండింగులో ఉండగానే స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించింది.

అనర్హత పిటిషన్ పెండింగులో ఉండగా ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాను ఆమోదించడం ప్రజాస్యామ్య విరుద్ధమని తెలుగుదేశం శాసనసభ్యుడు దూళిపాల నరేంద్ర చౌదరి విమర్శించారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడంపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

English summary
Speaker Nadendla Manohar accepted resignations of Nagam janardhan reddy and N prasanna kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X