సిఎంతో టిడిపి నేతలు భేటీ, చర్చల అంశం సస్పెన్స్
తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని నిత్యం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. టిడిపి కూడా ఇటీవల పలు సందర్భాల్లో తాము శీతాకాల సమావేశాల్లో అవిశ్వాసానికి సిద్ధమని తమతో ఎవరు కలిసి వస్తారో ఎవరు రారో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా తాము ప్రభుత్వానికి మద్దతిస్తూనే జగన్ను ఆపద సమయాల్లో కాపాడతామని చెప్పారు.
దీంతో వారు సిఎంతో అవిశ్వాస తీర్మానం పైన, వచ్చే సమావేశాల పైన చర్చించినట్లుగా పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు పైన వేసిన పిటిషన్ పైనా, తాజా రాజకీయ పరిణామాల పైనా చర్చించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మొత్తానికి సిఎంతో టిడిపి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా అందరిలో సస్పెన్స్ మిగిల్చింది.