సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ని, ఆందోళన కలిగింది: సునీల్

ఎమ్మార్ విల్లాలకు సంబంధించిన సిబిఐ విచారణలో పూర్తి వివరాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. కోనేరు ప్రసాద్ సలహా మేరకు తాను తుమ్మల రంగారావు వద్ద డబ్బులు తీసుకున్నాననే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు కావాలనే తనపై సిబిఐ తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన విమర్శించారు. అరెస్టు సమయంలో తన ఇంటిలో జరిపిన సోదాల్లో సిబిఐకి ఏ విధమైన ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు. తుమ్మల రంగారావుకు ఇచ్చినట్లే తనకు కూడా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్పై బుధవారం సిబిఐ కౌంటర్ దాఖలు చేయనుంది.












Click it and Unblock the Notifications