సిఎంకూ నాకూ యుద్ధమేమీ లేదు: బొత్స సత్తిబాబు

విజయలక్ష్మి పేరు మారటాన్ని ప్రస్తావించగా - విజయలక్ష్మి పేరు ఒక్కటే తాను పంపించానని ఎలా అనుకుంటారని, ఆమె పేరుతో పాటు ఆశావహుల పేర్లను కూడా పంపిస్తామన్నారు. అందులో కులాల కూర్పును కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ప్రకటిస్తుందన్నారు. తనకు తెలియకుండా జరిగిందని మీడియా ఎలా భావిస్తుందని ప్రశ్నించారు. ఏడులో ఒకటి ఎస్సీ స్థానం కాగా, మిగిలిన ఆరింటిలో ఐదు స్థానాలను రెడ్డి వర్గానికే ఇవ్వడంపై స్పందిస్తూ స్థానిక పరిస్థితులు, విజయావకాశాలను శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు.
తెలంగాణ వారికి పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని దామోదర్ రెడ్డి కోరడం తప్పు కాదని, తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి చెబితే చూసుకుంటుందన్నారు. కాగా, ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను తానే అధిష్టానానికి పంపించానని బొత్స చెప్పారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, చిరంజీవి, ఆయా ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారని వెల్లడించారు.
తెలంగాణ అయినా, సమైక్యాంధ్ర అయినా పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కాగా, ఉప ఎన్నికలు రిఫరెండం కాదని, అయితే, ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని పనితీరు సమీక్షించుకుంటామన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఫలితాలకు బాధ్యత ముఖ్యమంత్రిది కాబోదని, పార్టీదేనని చెప్పారు. మద్యం సిండికేట్లపై ఇప్పటికే చాలాసార్లు వివరణ ఇచ్చానన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications