ములాయంకు కాంగ్రెస్ ఆహ్వానం, ఇక మమతకు చెక్?

ఇందులో భాగంగానే ములాయం సింగ్కు కాంగ్రెసు పార్టీ ఓ ముఖ్య నేత నుండి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత ములాయం సింగ్ యాదవ్కు ఫోన్ చేసి సోమవారం ఢిల్లీ రమ్మని చెప్పారు. ములాయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ అంశంపై యుపి ముఖ్యమంత్రి, ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ములాయం సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని చెప్పారు. యుపిఏతో పొత్తు విషయంలో ఆయనదే ఫైనల్ అని చెప్పారు. ఆయన నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు. కాగా ఎస్పీ యుపిఏలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని కాంగ్రెసు పార్టీ కూడా తెలిపింది.












Click it and Unblock the Notifications