వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'ఇందిర బాట' వాయిదాకు బొత్స: కిరణ్ రెడ్డి ససేమీరా
జిల్లా ఇంచార్జ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు, మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాస రావు అక్కడే ఉండి ఇందిర బాట కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న పిసిసి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తిరిగి వారు విశాఖకు వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ఈ ముగ్గురు నేతలే కాకుండా జిల్లాకు చెందిన నేతలందరి పరిస్థితి ఇదే.
దీంతో రావడం... వెళ్లడం ఇబ్బందిగా మారుతుందని.... కాబట్టి బాటను వాయిదా వేసుకోవాలని బొత్స సూచించారట. కాని కిరణ్ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. సదస్సు తర్వాత రోజే బాట ఉంటే నేతలు అక్కడకు వెళ్లేందుకు ఇబ్బందవుతుందని కిరణ్కు బొత్స చెప్పారట. అయితే ఇందిరమ్మ బాట కార్యక్రమం ఎప్పుడో ఖరారైందని దీనిని మార్చేది లేదని కిరణ్ ఖరాఖండిగా చెప్పారట.
Comments
botsa satyanarayana kiran kumar reddy congress indira bata బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ఇందిర బాట
English summary
CM Kiran Kumar Reddy has rejected PCC chief Botsa Satyanarayana's appeal on Indira Bata programme.
Story first published: Sunday, December 16, 2012, 10:22 [IST]