బాబుకు షాక్: జగన్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే చింతల

రామచంద్రారెడ్డి గురువారం చంచల్గూడ జైలుకు వెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైయస్సార్ కాంగ్రెస్లో చేరేందుకు ఆయన నిర్ణయించుకోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 11న చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు.
కొన్ని నియోజక వర్గాల్లో ఇన్చార్జిలనే అభ్యర్థులుగా ప్రకటించాలని నిర్ణయించారు. వివాదం లేని నియోజక వర్గాలలో ఇన్చార్జిలను అభ్యర్థులుగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మహిళా సమస్యలపై సమావేశం ఢిల్లీ అత్యాచారంపై 6న ఎన్టీఆర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమవతి తెలిపారు.
మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. 9న చంద్రబాబు పాదయాత్ర చేపట్టి వంద రోజులు పూర్తవుతున్న, సందర్భంగా బిసి విభాగం ఆధ్వర్యంలో కుల వృత్తులను బాబు పాదయాత్రలో ప్రదర్శించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications