2గం.వరకు కిషన్రెడ్డి డెడ్లైన్: ఓయు విద్యార్థికి గాయం
పోలీసులు సమర దీక్షకు అనుమతించక పోవడంతో కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలు, తెలంగాణవాదులు బర్కత్పురాలోని నగర పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. మరోవైపు జెఏసి కార్యాలయంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం సమర దీక్షకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
అనుమతి కోసం చర్చించేందుకు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో చర్చించేందుకు వెళ్లారని కోదండరామ్ చెప్పారు. దీక్షకు అనుమతిపై నిర్ణయం చెబుతామని హోంమంత్రి చెప్పారన్నారు. చుక్కా రామయ్య, గద్దర్ తదితరులు సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. అనుమతి ఇప్పించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓయు గేటు వద్ద విద్యార్థి తలకు గాయం
రాజ్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు రాళ్లు రువ్వండంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఎన్సిసి గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ విద్యార్థి తలకు రాయి తగిలి గాయమైంది. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన మరికొంతమంది విద్యార్థులను పోలీసులు ఖైరతాబాద్ చౌరస్తాలో అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.