2గం.వరకు కిషన్రెడ్డి డెడ్లైన్: ఓయు విద్యార్థికి గాయం

పోలీసులు సమర దీక్షకు అనుమతించక పోవడంతో కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలు, తెలంగాణవాదులు బర్కత్పురాలోని నగర పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. మరోవైపు జెఏసి కార్యాలయంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం సమర దీక్షకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
అనుమతి కోసం చర్చించేందుకు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో చర్చించేందుకు వెళ్లారని కోదండరామ్ చెప్పారు. దీక్షకు అనుమతిపై నిర్ణయం చెబుతామని హోంమంత్రి చెప్పారన్నారు. చుక్కా రామయ్య, గద్దర్ తదితరులు సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. అనుమతి ఇప్పించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓయు గేటు వద్ద విద్యార్థి తలకు గాయం
రాజ్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు రాళ్లు రువ్వండంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఎన్సిసి గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ విద్యార్థి తలకు రాయి తగిలి గాయమైంది. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన మరికొంతమంది విద్యార్థులను పోలీసులు ఖైరతాబాద్ చౌరస్తాలో అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications