జగన్ సాక్షి కార్యాలయంపై టిడిపి దాడి, అద్దాలు ధ్వంసం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు తన పాదయాత్రలో వైయస్ జగన్ పైన, సాక్షి దిన పత్రిక పైన ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు ఉసిగొల్పిన కారణంగానే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు సాక్షి కార్యాలయంపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.
సాక్షి కార్యాలయంపై దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని, ఆయనను అరెస్టు చేసి కేసును నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని చూసి బాబుకు భయం పట్టుకుందని, అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది.
దాడికి పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. గుంటూరులో సాక్షి దిన పత్రిక కార్యాలయంపై దాడిని రాష్ట్ర ఎలక్ట్రానికి మీడియా అధ్యక్షుడు చందూ జనార్ధన్ ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications