గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సాక్షి కార్యాలయంపై టిడిపి దాడి, అద్దాలు ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక కార్యాలయంపై సోమవారం దాడి జరిగింది. గుంటూరు జిల్లాలోని కార్యాలయంపై కంకర, ఇటుక రాళ్లతో దాడిక చేశారు. ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. సాక్షి కార్యాలయంపై దాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పనేనని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, సాక్షి పత్రిక ఆరోపించింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు తన పాదయాత్రలో వైయస్ జగన్ పైన, సాక్షి దిన పత్రిక పైన ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు ఉసిగొల్పిన కారణంగానే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు సాక్షి కార్యాలయంపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.

సాక్షి కార్యాలయంపై దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని, ఆయనను అరెస్టు చేసి కేసును నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని చూసి బాబుకు భయం పట్టుకుందని, అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది.

దాడికి పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. గుంటూరులో సాక్షి దిన పత్రిక కార్యాలయంపై దాడిని రాష్ట్ర ఎలక్ట్రానికి మీడియా అధ్యక్షుడు చందూ జనార్ధన్ ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Some Telugudesam Party activists raided the office of Sakshi Telugu daily at Brodipet of Guntur district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X