జగన్ జగతిలో నిమ్మగడ్డ పెట్టుబడులపై ఐటి దృష్టి

జగతి పబ్లికేషన్స్ పన్ను మదింపు కోసం వాన్పిక్ వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ను తమకు ఇవ్వాలని కోరుతూ ఐటి శాఖ అధికారులు సిబిఐ కోర్టును కోరారు. దాంతో పాటు ఒప్పంద పత్రాలను, ఇతర నోట్ షీట్లను కూడా తమకు ఇవ్వాలని వారు కోరారు. అందుకు నాంపల్లిలోని సిబిఐ కోర్టు అనుమతించింది.
నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్ వ్యవహారంపై నిరుడు ఆగస్టు 13వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇది నాలుగవ చార్జిషీట్. ఈ చార్జిషీట్ కోసం ఐటి శాఖ అధికారులు సిబిఐ అధికారులను సప్రదించారు. అయితే, కోర్టు అనుమతితో వాటిని తీసుకోవాలని సిబిఐ సూచించింది. దీంతో డిసెంబర్ 3వ తేదీన వాటి కోసం ఐటి శాఖ కోర్టును ఆశ్రయించింది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన వాన్పిక్ అందుకు ప్రతిఫలంగా వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్ ప్రసాద్ను సిబిఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు. వైయస్ జగన్ కూడా చంచల్గుడా జైలులోనే ఉన్నారు. వాన్పిక్ వ్యవహారంలో దాఖలు చేసిన చార్జిషీట్లో సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా చేర్చింది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications