టీ ప్రక్రియలో వేగం: నవంబర్లో రెండు రాష్ట్రాలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆలస్యం చేసే యోచనలో కేంద్రం లేనట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్సమావేశంలో కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ రూపొందించిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రతిపాదనపై చర్చించితర్వాత సభ ఆమోదించినా..ఆమోదించకపోయినా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ కేంద్ర ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం లేకపోవచ్చు. దీనిపై కేంద్రం ముందే ప్రకటించిన విధంగా అసెంబ్లీ అభిప్రాయం నామమాత్రమే కావొచ్చు.సీమాంధ్ర జరుగుతున్న ఉద్యమాలకు ఆ ప్రాంత నేతలు మద్దతు పలికి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాష్ర్ట విభజనను నిలిపేయాలని, లేదా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి.
కేంద్రం కూడా విభజన అంశానికి త్వరగా పరిష్కారం చూపాలని చూస్తోంది. హైదరాబాద్ పై వివాదం ఏర్పడిన నేపథ్యంలో..సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవంబర్ చివరి నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడి ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఒకరు చెప్పడం గమనార్హం.
2009లో లాగా వెనక్కి వెళ్లకుండా చూసుకోవాలనే స్థిరనిశ్చయంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేస్తారు. తెలంగాణలో 17 లోకసభ స్థానాలున్నాయి. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోగలమని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది.
జలపంపిణీలోనూ, విద్యుత్తు పంపకాల్లోనూ సవాళ్లు ఎదురు కావచ్చునని అంటున్నారు. అయితే, అది కూడా సమస్య కాదని, త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన కసరత్తు జరిగిందని అంటున్నారు. అప్పులు విషయం మాట్లాడుతన్నప్పటికీ వాటిని ప్రాజెక్టులవారీగా కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణలోని ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులను తెలంగాణ రాష్ట్రానికి, సీమాంధ్రలోని ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులను సీమాంధ్రకు కేటాయించే అవకాశం ఉంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications