సెలవు వద్దన్న కలాం, బాబు ఫాలో: ఏపీలో పాఠశాలలు అదనంగా గంటపాటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ గంటపాటు పాఠశాలలు అదనంగా పని చేయనున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో మంగళవారం నాడు పాఠశాలలు అదనంగా పని చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు.
అదనపు గంటలో అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పైన విద్యార్థులకు బోధన చేయాలని ఆదేశించారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా గంటపాటు అదనంగా పని చేయనున్నాయి.
తాను మృతి చెందినప్పుడు పాఠశాలలు, కార్యాలయాలు బంద్ చేయవద్దని, అవసరమైతే అదనంగా మరో రోజు అవి పని చేయాలని అబ్దుల్ కలాం చెప్పారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం మాట్లాడుతూ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కూడా కలాం మృతి నేపథ్యంలో సెలవు దినంగా ప్రకటించలేదు. కలాం మృతి నేపథ్యంలో ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. అయితే, మంగళవారం నాడు సెలవు అన్నట్లుగా వార్తలు రావడంతో దానిని తోసిపుచ్చింది.
నేడు జాతీయ సెలవు దినం కాదని కేంద్రం ప్రకటించింది. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని ఉదయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. తాను మరణిస్తే సెలవు ఇవ్వవద్దని కలాం చెప్పిన నేపథ్యంలో దానిని కేంద్రం, ఏపీ ప్రభుత్వం పాటించాయి.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications