సీబీఐ ఎఫెక్ట్: హఠాత్తుగా సభ నుంచి వెళ్లిన జగన్, వైసిపి.. అందుకేనా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లారు. దీనిపై టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర తనదైనశైలిలో స్పందించారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లారు. దీనిపై టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర తనదైనశైలిలో స్పందించారు.
జగన్, వైసిపి సభ్యులు సభలో నుంచి ఉన్నట్లుండి ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాలేదని దూళిపాళ్ల అన్నారు. కనీసం వాకౌట్ చేస్తున్నామని కూడా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు.

సభ నుంచి బయటకు వచ్చాకే తనకు కూడా విషయం అర్థమయిందని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పిటిషన్ దాఖలు చేయడంతో వెళ్లిపోయారా అని ప్రశ్నించారు.
బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేయడంతోనే, ఆ వార్త తెలుసుకొని జగన్ ఆందోళనగా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రకరకాల కారణాలతో జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఎంతో జాప్యం జరిగిందని, ఇప్పటికైనా వేగంగా ముందుకు వెళ్లాలన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications