నిగ్గు తేలనున్న బాబు వాయిస్: సిబిఐకి అప్పగించాలని పిటిషన్
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఆడియో, వీడియో టేపుల డీకోడింగ్ను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ప్రారంభించినట్లు సమాచారం. దాంతో ఆడియో టేపులోని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గొంతు అవునా, కాదా అనేది తేలనుంది. నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో చంద్రబాబు నేరుగా మాట్లాడినట్లు గల ఓ ఆడియో టేప్ లీకైన విషయం తెలిసిందే.
డీకోడింగ్ కోసం ప్రత్యేకంగా ఎఫ్ఎస్ఎల్ మూడు బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఇటీవల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించిన విషయం తెలిసిందే.

వాటిని విడిగా కాపీచేసి, వాటిలోని వాస్తవాలను తేల్చేందుకు ఎఫ్ఎస్ఎల్ సిద్ధమైంది. ఇందుకు ఏర్పాటు చేసిన మూడు బృందాలు కూడా ఇప్పటికే తమ పనిని ప్రారంభించాయి. తన ఫోన్ను ట్యాప్ చేశారని ఒకసారి, వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్టు చేసి టేప్ తయారు చేశారని మరోసారి చంద్రబాబు అంటూ వచ్చారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడదు రేవంత్రెడ్డి కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. హైకోర్టుకు చెందిన సీనియర్ లాయర్ పీవీ కృష్ణయ్య ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలను రాబట్టాల్సిన అవసరం ఉన్నందున సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications