జగన్ అలా అనడం సరికాదు..! విభజన హామీల గురించి తెలుసుకుని మాట్లాడలన్న ఉండవల్లి..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి కి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. 'కేంద్రంలో ఎన్డీయేకు 250 ఎంపీ స్థానాలు దాటకూడదని దేవుడిని కోరుకున్నాను.. కానీ 350కి పైగా వచ్చేశాయి. ఇవాళ కేంద్రానికి మన ఎంపీలు అవసరం లేదు. కమాండింగ్ చేయలేను. డిమాండింగ్ చేయలేన'ని చెప్పిన జగన్మోహనరెడ్డితో నేను విభేదిస్తున్నాను. మన ఎంపీలు అవసరం లేదనడం సరికాదు.. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీలను వాళ్లు అమలు చేయాల్సిందే' అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలను కేంద్రం అమలుచేయాల్సిందేనన్నారు. రాష్ట్ర విభజనపై లోక్సభలో చర్చపెట్టాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగింది. ఆ సందర్బంగా ఇచ్చిన హామీలను మాత్రం నాయకులు పట్టించుకోలేదన్నరు ఉండవల్లి. ఇవాళ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. పంపిణీ జరగలేదు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుతో సామరస్యంగానే ఉండాలని జగన్ కు సూచించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే వాటిని తెండి. కేసీఆర్ తనకొక ఓడరేవు కావాలని కోరుతున్నారు. అక్కడ సముద్రం లేదు. మనకు విశాలమైన సముద్రతీరం ఉంది.

కేసీఆర్కు ఇక్కడ ఒక పోర్టు పెట్టుకునే అవకాశమివ్వండి. వాళ్లే అభివృద్ధి చేసుకుని ఉపయోగించుకుంటారు. శ్రీసిటీలా వాన్పిక్ ప్రాజెక్టు కూడా ప్రయోజనకారే. దానివల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక ఉద్యోగాలు వస్తాయని వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు చెప్పారు. వాన్పిక్ విషయంలో కేసులు ఉండవచ్చు. మీరు (జగన్) ఆ వ్యవహారంలో జైలుకెళ్లినా అక్కడి ప్రజలు మాత్రం వైసీపీకే ఓటు వేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి గుర్తు చేసారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications