చుక్కెదురు: కారు వదిలేసిన వెళ్లిపోయిన గిడ్డి ఈశ్వరి
విశాఖపట్నం: రహదారి నిర్మించాలన్న డిమాండ్తో గిరిజనులు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని బుధవారం అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు ఎమ్మెల్యే తన కారును అక్కడే విడిచిపెట్టి ఆటోలో జన్మభూమి నిర్వహించే ప్రాంతానికి వెళ్లారు.
పాడేరు మండలం వనుగుపల్లిలో బుధవారం నిర్వహించే జన్మభూమి గ్రామ సభకు ఎమ్మెల్యే ఈశ్వరి వెళ్లాల్సి ఉంది. అయితే రహదారి సౌకర్యం లేని గిరిజనులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కందమామిడి జంక్షన్ వద్ద ఎమ్మెల్యే ఈశ్వరి వాహనాన్ని అటకాయించారు.

తమ గ్రామాలకు రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఈశ్వరి వనుగుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదించామని, ఆ ప్రతిపాదనల ప్రతులు చూపిస్తూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
అయినా ఆందోళనకారులు శాంతించలేదు.లిఖితపూర్వకంగా రాసివ్వాలని పట్టుబట్టారు. దీంతో ఆగ్రహించిన ఈశ్వరి 15 రోజులలో రోడ్డు నిర్మాణం ఏలా అవుతుందని ప్రశ్నించారు. చివరకు ఎమ్మెల్యే ఆటోలో జన్మభూమి గ్రామ సభకు వెళ్లిపోయారు.
రాజకీయ దురుద్దేశ్యంతో అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని గిడ్డి ఈశ్వరి మీడియా ప్రతినిధులతో అన్నారు. బాలరాజు మంత్రిగా ఐదేళ్లపాటు పనిచేసి వనుగుపల్లికి ఎందుకు రోడ్డు నిర్మించలేకపోయారని ఆమె ప్రశ్నించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications