సదావర్తి భూముల కేసులో మరో మలుపు: ఆళ్ల రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో షాక్, కానీ
సదావర్తి భూముల వ్యవహారం మంగళవారం నాడు మరో మలుపు తిరిగింది. హైకోర్టులో ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిగింది.
హైదరాబాద్/విజయవాడ: సదావర్తి భూముల వ్యవహారం మంగళవారం నాడు మరో మలుపు తిరిగింది. హైకోర్టులో ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిగింది.
ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రూ.27.44 కోట్లను చెల్లించారు. కానీ ఆల్ ఇండియా బ్రాహ్మణ అసోసియేషన్ ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.

దీంతో మరోసారి ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లో జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని చెప్పింది.
ఆళ్ల చెల్లించిన రూ.27.44 కోట్లను బేస్ ప్రైస్గా నిర్ణయించి వేలం నిర్వహించాలని సూచించింది. వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే అప్పుడు ఎమ్మెల్యే ఆళ్లకు సదావర్తి భూములు చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది.
అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. సదావర్తి భూములకు తాను రూ.27.44 కోట్లు చెల్లిస్తానని, వాటిని తనకు ఇవ్వాలని హైకోర్టుకు ఆళ్ల చెప్పారు. దానికి అంగీకరించడంతో ఆయన డబ్బును ఏపీ ఎండోమెంట్ కమిషన్కు చెల్లించారు. ఇప్పుడు బ్రాహ్మణ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్తో కొత్త మలుపు తిరిగింది. వేలంలో ఎవరూ ముందుకు రాకుంటే భూములు ఆయనకే చెందుతాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications