ఇద్దరు మిత్రులు: చిన్ననాటి నుంచి ప్రాణం పోయేవరకు
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో బుధవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, వ్యాపారి చినబాబు(కామని బాలమురళీమోహనకృష్ణ) కుమారుడు రాజా రవిచంద్ర చిన్ననాటి నుంచి స్నేహితులు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో బుధవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, వ్యాపారి చినబాబు(కామని బాలమురళీమోహనకృష్ణ) కుమారుడు రాజా రవిచంద్ర చిన్ననాటి నుంచి స్నేహితులు. వారు కలిసి చదువుకున్నారు. కలిసి తిరిగారు. పార్టీకైనా, మరేదైనా కార్యక్రమమైనా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు ఇద్దరు కలిసే మరణించడం ఇరుకుటుంబాల్లో పెను విషాదం నింపింది.

చిన్ననాటి నుంచి ప్రాణం పోయేవరకు
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో బుధవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, వ్యాపారి చినబాబు(కామని బాలమురళీమోహనకృష్ణ) కుమారుడు రాజా రవిచంద్ర చిన్ననాటి నుంచి స్నేహితులు. వారు కలిసి చదువుకున్నారు. కలిసి తిరిగారు. పార్టీకైనా, మరేదైనా కార్యక్రమమైనా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు ఇద్దరు కలిసే మరణించడం ఇరుకుటుంబాల్లో పెను విషాదం నింపింది.

రెండు కుటుంబాల్లోనూ వీరే మగ పిల్లలు
ఆ రెండు కుటుంబాల్లోనూ వీరే మగపిల్లలు కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో అంతులేని ఆవేదనను నింపింది. నిషిత్ నెల్లూరులో 1994 జులై 4న జన్మించాడు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇక్కడి నారాయణ విద్యాసంస్థలోనే చదువుకున్నాడు. తొమ్మిది, పది తరగతులు మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియెట్ బెంగళూరులో పూర్తి చేశాడు.

బాధ్యత కోసం చదువులు
నారాయణ విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోవాలన్న ఆలోచనతో సింగపూర్లో బీబీఏ పూర్తి చేశాడు. కాగా, టంగుటూరుకు చెందిన పారిశ్రామికవేత్త కామని బాలమురళీమోహనకృష్ణ, సుభాషిణిల ఏకైక కుమారుడు రాజా రవిచంద్ర. వీరికి లేఖ అనే కుమార్తె ఉన్నారు.

ఆ పరిచయమే ప్రాణ స్నేహం
రవిచంద్ర 1995లో మే 17న జన్మించాడు. నిషిత్, రవిచంద్ర ఇద్దరూ ఇండస్ స్కూల్లో చదివారు. ఆ పరిచయయే వారిని ప్రాణ మిత్రులను చేసింది. ఆ తర్వాత ఇద్దరూ హైదరాబాద్లోనే ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ డిప్లొమా ప్రొగాం(ఐబీడీపీ) పూర్తి చేశారు. ఏ వేడుకలైనా ఒకరికొకరు ఖరీదైన కానుకలు ఇచ్చుకునేవారు.

తీరని శోకం
కాగా, తండ్రి కోరిక మేరకు రవిచంద్ర సింగపూర్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ) పూర్తి చేశారు. చదువు పూర్తికాగానే టంగుటూరులోనే తండ్రి వద్ద ఉంటూ పొగాకు వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటూ ఏడాదిపాటు గడిపారు రవిచంద్ర. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. త్వరలో వ్యాపార బాధ్యతలు అప్పగించాలని తండ్రి బాలమురళీమోహనకృష్ణ భావిస్తున్న తరుణంలో రవిచంద్ర తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆయనకు తీరని శోకం మిగిల్చింది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications