పట్టిసీమపై పుష్కరాల ఎఫెక్ట్, రాహుల్ గాంధీకి అశోక్ కౌంటర్
రాజమండ్రి: గోదావరి పుష్కరాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. తొలి రోజు విషాద ఘటన నేపథ్యంలో చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇది పట్టిసీమ ప్రాజెక్టు పైన పడిందని అంటున్నారు.
12 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండి పరిపాలన చేశారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మంత్రులతో భేటీ అయ్యారు. ఒకవిధంగా రాజమహేంద్రవరం తాత్కాలికంగా రాజధాని అయింది. చంద్రబాబు ఎక్కువగా పుష్కరాల పైన దృష్టి సారించారు.
మరోవైపు, పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాల కోసం తరలి వచ్చారు. దీంతో, ఈ 12 రోజులు పట్టిసీమ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. పట్టిసీమ కోసం వెళ్లే దారిలో భక్తులతో నిండిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు కోసం సిమెంట్, పైపులు, స్టీల్ తదితరాలను తీసుకు వెళ్లలేకపోయారు.

షెడ్యూల్ ప్రకారం మార్చి 2016 నాటికి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఫస్ట్ ఫేజ్ ట్రయల్ రన్ పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాకు నీరు ఇచ్చే పట్టిసీమ ప్రాజెక్టు పైన చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అశోక్ గజపతి రాజు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేయడం లేదన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఖండించారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కోనాయపాలెం గ్రామంలో బహుళార్థ ప్రయోజన రక్షణ భవనాన్ని ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే విభజన జరిగిందని, పద్ధతిపరంగా విభజన చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications