Save Amaravati: 24 గంటలు: నిన్న దేవినేని ఉమా.. రేపు గద్దె రామ్మోహన్..ఇక వరుసగా..!
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులతో కలిసి 19 రోజులుగా నిరసన ప్రదర్శలను నిర్వహిస్తూ వస్తోన్న టీడీపీ నాయకులు నిరసనలు, ధర్నాల తీవ్రతను పెంచారు. నిరాహార దీక్షలకు పూనుకుంటున్నారు.

రైతులకు మద్దతుగా..
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, దీనికి అదనంగా విశాఖపట్నం, కర్నూలును రాజధానులుగా అభివృద్ధి చేయబోతున్నామంటూ వైఎస్ జగన్ ఇదివరకే అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించారు. ఆందోళన బాట పట్టారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వహించింది. రైతులకు దిశా నిర్దేశాన్ని చేస్తోంది.

దేవినేని ఉమా తరువాత..
రైతులకు మద్దతుగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఇదివరకే 24 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. విజయవాడ శివార్లలోని గొల్లపూడిలో కొద్దిరోజుల కిందటే నిరాహార దీక్షను ముగించారు. అనంతరం ఆ శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనసాగిస్తున్నారు. ఆ శిబిరంలోనే దశలవారీగా రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నారు.

విజయవాడ తూర్పులో..
తాజాగా- టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అశోక్ నగర్ లో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు గద్దె రామ్మోహన్ నిరాహార దీక్ష ఆరంభమౌతుంది. 24 గంటల పాటు కొనసాగుతుంది. ఆయనతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు నిరాహార దీక్షా శిబిరంలో కూర్చోనున్నారు.

కమిటీ నివేదికల రద్దు.. నిర్ణయం వెనక్కి..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సిఫారసు చేస్తూ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను రద్దు చేయాలని, మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను వైఎస్ జగన్ వెంటనే విరమించాలనేది టీడీపీ ప్రధాన డిమాండ్. అమరావతిని యధాతథంగా కొనసాగించాలంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications